- Advertisement -
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు 500 మంది అభ్యర్థులు, బిజెపికి 1000 మంది అభ్యర్థులు దొరకలేదని ఎంఎల్సి, రైలు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం టిఆర్ఎస్ భవనం నుంచి పల్లా మాట్లాడారు. ఐదేళ్ల కిందటే సిఎం కెసిఆర్ అన్నపూర్ణ క్యాంటీన్లను ప్రారంభించారని, అన్ని మున్సిపాలిటీల్లో ఉన్న చెరువులను మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించిన ఘటన టిఆర్ఎస్దేనని పల్లా ప్రశంసించారు. టిఆర్ఎష్ ప్రభుత్వం చేస్తున్న పనులు కాంగ్రెస్ నేతలకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. విజన్ లేని కాంగ్రెస్ విజన్ డాక్యుమెంట్ను విడుదల చేసిందని, కాంగ్రెస్, బిజెపిలకు మున్సిపల్ ఎన్నికల్లో చావుదెబ్బపడటం ఖాయమని విమర్శించారు.
MLC Palla Rajeswar Reddy Comments on BJP, Congress
Vission less Congress create Vission Document:Palla
- Advertisement -