వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర
రాజనరసింహ వెల్లడి వరంగల్లో
రూ.37కోట్లతో రీజినల్ క్యాన్సర్
సెంటర్ ఏర్పాటు ఖమ్మం జిల్లా
పర్యటనలో ప్రకటన
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో క్యాన్సర్, బి పి , షూగర్ (ఎన్ సి డి )రోగుల సంఖ్య పెరుగుతున్నందునా ప్రతి జిల్లాకు మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్లను అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ తె లిపారు.గురువారం ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం బల్లెపల్లి సమీపంలో రూ.130 కోట్ల వ్యయంతో నూతనంగా ని ర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవన సముదాయ నిర్మాణ ప నులకు డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు తు మ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలతో కలిసి ఆ యన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి దామోదర రాజనర్సింహ మా ట్లాడుతూ రాష్ట్రంలో బి పి,షూగర్, క్యాన్సర్, ఉబకాయం వం టి రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని దీనిని దృష్టిలో పెట్టుకొని మొబైల్ క్యాన్సర్ స్క్రినింగ్ యూనిట్లను ప్రతి జిల్లా కు మంజూరు చేశామన్నారు. ప్రపంచ బ్యాంకు మంజూరు చేసి న రూ.4,100 కోట్ల నిధుల నుంచి వరంగల్ లో రూ.37 కోట్ల తో రీజినల్ క్యాన్సర్ సెంటర్ను, ఖమ్మం జిల్లాకు ఆర్గన్ రిట్రివ ల్ సెంటర్ను,
ఖమ్మం నగరానికి నర్సింగ్ కళాశాలను మంజూ రు చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ఖమ్మం ప్రాంతంలో వ్యాస్కులర్ యాక్సిస్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. గుండెలోని దమనులు, సిరులకు సంబంధించిన ఈ సెంటర్ను ఇక్కడ స్థాపించనున్నట్లు ఆయన చెప్పారు. వైద్య రంగంలో ప్రాథమిక వైద్యం చాలా కీలకమని, ఎక్కడైనా పి హెచ్సిలు అవసరం ఉంటే వెంటనే మంజూరు చేస్తున్నామని, అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో కూడా 6 పిహెచ్సిలను కొ త్తగా మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వైద్యపరంగా ప్రజలు హైదరాబాద్ పై ఆధారపడకుండా ఇక్కడనే సూపర్ స్పెషాలిటీ సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నామన్నారు. సూపర్ స్పె షాల్టీ లేదా కార్పొరేట్ వైద్యం కోసం గోదావరి పరివాహక ప్రాం త ప్రజలు ఎవరూ కూడా హైదరాబాద్ వంటి పట్టణాలకు రా కుండా ఆయా ప్రాంతాల్లోనే ప్రభుత్వ పరంగా కార్పొరేట్ వైద్య సేవలను అందిస్తున్నామని ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నామన్నారు .
ఖమ్మంకు మెడికల్ కాలేజీ మణిహారం : తుమ్మల
ఖమ్మంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు మణిహారంగా మారనుంద ని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. 36 ఎకరాల్లో రూ. 166 కోట్లు ఖర్చు పెట్టి ఆధునిక హంగులతో కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.పేద విద్యార్థులు వైద్యవిద్యను అభ్యసించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని వెల్లడించారు. త్వరలో ఖమ్మంలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు.
విద్య, వైద్యానికి ప్రాధాన్యం : మంత్రి పొంగులేటి
కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి ఎనలేని ప్రాధాన్యమిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు.గత ప్రభుత్వం అన్ని రంగాలను విస్మరించిందని ఆరోపించారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తల తాకట్టు పెట్టి విద్య, వైద్యానికి ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు.గత ప్రభుత్వం కొన్ని మెడికల్ కాలేజీలను వదిలేసిపోయిందని విమర్శించారు. గత ప్రభుత్వం పెట్టిన రూ. 1000 కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లిస్తూ వైద్య శాఖలో నూ తన ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు వం టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని తెలిపారు.