Saturday, July 27, 2024

మెదక్ లో విషాదం.. బట్టలు ఆరేయడానికి వెళ్లి కరెంట్ షాక్ తో తల్లికొడుకు మృతి

- Advertisement -
- Advertisement -

కరెంట్ షాక్‌తో తల్లికొడుకు మృతి చెందిన విషాదం సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. శివ్వంపేట మండలం ఉసిరికపల్లిలో మణెమ్మ(45) మహిళ బట్టలు ఆరేయడానికి వెళ్లి కరెంట్ షాక్‌కు గురైంది. దీంతో తల్లిని కాపాడడానికి వెళ్లిన కొడుకు ప్రసాద్, కూతురు శ్రీలతకు కరెంట్ షాక్‌ తగిలింది.

ఈ ఘటనలో తల్లికొడుకు అక్కడికక్కడే మృతి చెందగా.. కూతురు శ్రీలతకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు శ్రీలతను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News