Sunday, April 28, 2024

కారు మారి బలి తల్లీకొడుకుల దుర్మరణం

- Advertisement -
- Advertisement -

బలోడ్: చత్తీస్‌గఢ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మృతులలో తల్లీ కొడుకు కూడా ఉన్నారు. బలోడ్ జిల్లాలోని ఖప్పార్వాడా గ్రామం వద్ద మంగళవారం రాత్రి రాయ్‌పూర్ నుంచి కారులో వెళ్లుతున్న కుటుంబం మార్గమధ్యంలో ఓ ట్రక్కును ఢీకొంది.

ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. బలోడ్‌కు చెందిన ఓ మహిళ ఆమె కొడుకు కూడా చనిపోయ్యారు. ఇరువురు తమ కారు మధ్యలో చెడిపోవడంతో ఈ కారును ఆపి ఎక్కారని, ప్రమాదంలో మృతి చెందారని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News