Monday, April 29, 2024

నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో అగ్ని ప్రమాదం….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సిలిండర్ పేలడంతో బాలింతలు, గర్భిణీలు బయటకు పరుగులు తీశారు. ఆస్పత్రి సిబ్బంది సమాచారం మేరకు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు, అగ్నిమాపక అధికారి వెల్లడించారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News