Friday, June 20, 2025

పైన, కింద రాష్ట్రాలతో వివాదం కోరుకోవట్లేదు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రస్తుత ప్రాజెక్టుల్లో మార్పులు చేస్తే.. తెలంగాణ, ఎపి ఒకరికొకరు చెప్పుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఢిల్లీలో మీడియాతో సిఎం రేవంత్ చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం గతంలో సిఎంల స్థాయిలో చర్చలు జరిపామని, అనేక అంశాలను చర్చించామని పేర్కొన్నారు. బనకచర్లపై కూడా తమతో చర్చించి ఉంటే బాగుండేదని అన్నారు. తెలుగువారి మధ్య అనవసరమైన సమస్యలు ఉండొద్దని తెలిపారు. తెలంగాణకు పైన, కింద ఉన్న రాష్ట్రాలతో వివాదం కోరుకోవట్లేదని స్పష్టం చేశారు. కింది రాష్ట్రంగా ఎపికి హక్కులు ఉన్నాయంటున్నారు.. కానీ, అదే రకమైన హక్కులు తెలంగాణకు కూడా ఉంటాయని గుర్తు చేశారు. ఈ నెల 23న రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉందని తెలిపారు. అందులో బనకచర్లపై చర్చిస్తామని అన్నారు. ఒక అడుగు ముందుకేసి తామే ఎపిని చర్చలకు పిలుస్తామని పేర్కొన్నారు.

మోదీ సీట్లో కూర్చోవాలంటే చంద్రబాబు సపోర్టు కావాలని.. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలంటే గోదావరి నీటిని తరలించాలని రేవంత్ (CM Revanth Reddy) అన్నారు. విభజన చట్టంలో పోలవరానికి మాత్రమే అనుమతి ఉందని.. బనకచర్ల అనేది పోలవరానికి అనుబంధ ప్రాజెక్టు అని తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభిప్రాయం తప్పక తీసుకోవాల్సిందే అని స్పష్టం చేశారు. 2016, 2018లో ఎపి సర్కారు రెండు జివొలు ఇచ్చిందని.. జివొల ఆధారంగా వ్యాప్కోస్ 150 పేజీల నివేదిక ఇచ్చిందని అన్నారు. గోదావరి-పెన్నా అనుసంధానంలో బనకచర్ల ఒక భాగమని పేర్కొన్నారు. 86 రోజుల్లో 400 టిఎంసిలు తరలించేలా బనకచర్లను డిజైన్ చేశారని.. గోదావరిలో 968 టిఎంసిలు వాడే వెసులుబాటు తెలంగాణకు ఉందని.. కేటాయించింది వాడుకునేందుకు అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. అందుకే ఈ వివాదమని.. కోర్టుకు వెళ్లడం కంటే ముందుగా చర్చించుకోవడం మంచిదని.. వివాదం పరిష్కారానికి ఎలాంటి డెడ్‌లైన్ లేదని అన్నారు. .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News