Thursday, March 28, 2024

పేదరికం కారణంగా ఎవరూ చదువుకు దూరం కావద్దు

- Advertisement -
- Advertisement -

No one should stay away from education because of poverty

అన్ని వర్గాలకు ఉచిత విద్య అందించడానికే గురుకులాలు
మంత్రి కొప్పుల ఈశ్వర్
అత్యుత్తమ ఫలితాలు సాధించిన మైనారిటీ విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేత

హైదరాబాద్ : పేదరికం కారణంగా ఏ ఒక్కరూ విద్యకు దూరం కావొద్దనేది ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్దేశమని మైనారిటీ, ఎస్‌సి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ సదాశయంతోనే గురుకులాలను పెద్ద సంఖ్యలో నెలకొల్పారని చెప్పారు. తెలంగాణలో ఐదు సొసైటీల ద్వారా 985 గురుకుల పాఠశాలల్లో సుమారు ఆరు లక్షల మంది విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో ఉచిత విద్యను అందించడం జరుగుతోందని అన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు పోషకాహారాన్ని కూడ ఉచితంగానే అందిస్తున్నామన్నారు. బంజారాహిల్స్‌లోని మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన అత్యుత్తమ ఫలితాలు సాధించిన పలువురు విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. విద్యార్థులకు అభినందించారు. తెలంగాణలో నడుస్తున్న గురుకులాలను దేశ విదేశాలకు చెందిన ఎంతో మంది ప్రముఖులు కొనియాడుతున్నారని మంత్రి చెప్పారు. అత్యుత్తమ ఫలితాలు సాధించడమే గాకుండా చదువుతో పాటు క్రీడలు, ఇతర రంగాలలో కూడా గొప్పగా రాణిస్తున్న ఈ పాఠశాలలు మనందరికీ గర్వకారణమన్నారు. విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దేందుకు విశేష కృషి చేస్తున్న అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని మంత్రి కొప్పుల, ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఎకె ఖాన్, సొసైటీ అదనపు కార్యదర్శి దిలావర్ తదితరులు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News