Sunday, April 28, 2024

తెలంగాణలో మరో రెండు కొత్త మండలాల నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మరో రెండు మండలాలను, కొత్తగా ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎర్రవల్లిని మండలంగా ప్రకటిస్తూ ఇప్పటికే ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసి అభిప్రాయాలను సేకరించింది. తాజాగా అందుకు సంబంధించి తుది నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే కామారెడ్డి జిల్లాలోని ముహమ్మద్‌నగర్‌ను నూతన మండలంగా, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసర మండలంలోని బొగారం గ్రామ పరిధిలో ఉన్న బార్సిగూడను నూతన రెవెన్యూ గ్రామంగా ఏర్పాటుచేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్లను విడుదల చేసింది. వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆ నోటిఫికేషన్లలో పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News