Friday, May 3, 2024

12న చలో హైదరాబాద్‌కు భారీగా ఉద్యోగులు తరలిరావాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిపిఎస్, ఎన్‌పిఎస్‌ల రద్దు కోరుతూ ఈనెల 12వ తేదీన ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేపట్టిన ఛలో హైదరాబాద్‌కు భారీ సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు హాజరుకావాలని హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు హైదరాబాద్‌లోని వివిధ ప్రభుత్వ ప్రధాన కార్యాలయంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎస్ రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి కల్వల్ శ్రీకాంత్, నరేందర్‌రావులు మాట్లాడుతూ ‘అభి నహీతో కబీ న హీ’ నినాదంతో రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మద్దతు, స హకారంతో ‘పాత పెన్షన్ సాధన సంకల్ప యాత్రను 33 జిల్లాలో విజయవంతంగా పూర్తి చేశామన్నారు.

అభినహితో కబీ నహీ అనే నినాదంతో తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గం గాపురం స్థితప్రజ్ఞ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ సభను ఈ నెల 12వ తేదీన నిర్వహించేందుకు తామంతా కుటుంబ సభ్యులతో సహా హాజరవుతామని, ఉ ద్యోగులు పెద్ద ఎత్తున హాజరు కావాలని వారు విజ్ఞప్తి చేశారు.

ప్రచారంలో భా గంగా కమిషనర్, భూ పరిపాలన ప్రధాన కార్యాలయం, సంచాలకులు, వైద్య విధాన పరిషత్, కోటి, హైదరాబాద్ జిల్లా ప్రధాన ఆసుపత్రి, సాంకేతిక ,కళాశాల విద్య ప్రధాన కార్యాలయం, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, ఎర్రమంజిల్ జ లసౌధ ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్ కార్యాలయంలో వారు ప్రచారా న్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ కోటకొం డ పవన్, హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు, అశోక్ రెడ్డి, శ్యాం సుందర్, ఈసీ మెంబర్స్, అరవింద్, అంజిరెడ్డి, రెడ్డప్ప, మల్లేష్, ప్రవీణ్, భాస్కర్, మల్లేష్, ప్రవీణ్, శతదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News