- Advertisement -
కుత్బుల్లాపూర్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరంపెట్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బైక్ అదుపుతప్పి టిప్పర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి టిప్పర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
One Death in Road Accident At Dundigal
- Advertisement -