Friday, May 3, 2024

ఎర్రకోట ఘటననాటి నుంచి వంద మంది రైతుల జాడలేదు

- Advertisement -
- Advertisement -

Over 100 Punjab farmers ‘missing’ since Red fort incident

 

న్యూఢిల్లీ : ఎర్రకోట వద్ద గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన ఘటనల తరువాత 100 మంది రైతుల జాడ తెలియడం లేదు. పంజాబ్‌కు చెందిన ఈ రైతులు ఏమయ్యారనేది ఇప్పుడు ఆందోళనకరం అయింది. రైతులు గల్లంతు అయిన విషయాన్ని స్వచ్ఛంద సేవా సంస్థ పంజాబ్ మానవ హక్కుల సంస్థ తెలిపింది. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనానికి దారితీసింది. ట్రాక్టర్ పరేడ్‌లో పాల్గొనడానికి వచ్చిన పంజాబ్ రైతులు కన్పించకుండా పోయినట్లు ఈ హక్కుల సంస్థ తెలియచేయడంతో పంజాబ్‌లో రైతు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. మోగా దగ్గరిలోని తతారివాలా గ్రామస్తులు డజన్ మంది కూడా ఈ వంద మందిలో ఉన్నారు. రైతుల గల్లంతుపై భారతీయ కిసాన్ యూనియన్ (రాజేవల్) నేత బల్బీర్ సింగ్ స్పందించారు. అదృశ్యం అయినట్లు చెపుతున్న వారి పేర్లను సేకరించడం జరుగుతుందని, వారి ఆచూకికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News