Sunday, April 28, 2024

తేలని టికెట్ల పంచాయితీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హస్తం పార్టీలో సీట్ల పంచాయతీ ముదురుతుంది. సమయం దగ్గర పడుతున్న కొద్ది పార్టీలోని ఆశావాహూలలో టెన్షన్ పెరుగుతు స్వంత పార్టీ నేతలపై విమర్శలు, ఆరోపణలు, ఫిర్యాదుల పర్వం ప్రారంభించారు. టికెట్ వస్తే పోటి చేస్తా…లేకపోతే మరో పార్టీలోకి పోయి టికెట్ తెచ్చుకుంటా అంటు అంతర్గత సమావేశాల్లో కొంత మంది ఆశావహూలు స్పష్టం చేస్తు హల్‌చల్ చేస్తున్నారు. వర్గపోరుకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకుల ప్రవర్తన మాత్రం మారడం లేదు. ఉమ్మడి జిల్లాలోని 17 శాసనసభ స్థానాల్లో నాలుగైదు స్థానాల్లో మాత్రం అభ్యర్థ్దులపై స్పష్టత వచ్చిన మెజారిటి నియోజకవర్గాల్లో అభ్యర్దుల ఎంపిక పార్టీకి సవాల్‌గా మారింది. అధికార బిఆర్‌యస్ పార్టీని డికొనే కనీస సత్తా లేని వారు సైతం ఒక్కో సీటుకు పదుల సంఖ్యలో దరఖాస్తులు సమర్పించుకోవడంతో పాటు పోటికి సై అంటు సవాల్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు కొడంగల్ రేవంత్ రెడ్డి, వికారాబాద్‌లో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, పరిగిలో మాజీ శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డి సీట్లపై స్పష్టత ఉన్న మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థ్దుల ఎంపిక కత్తిమీద సాములగానే మారింది.

టికెట్‌ల పంచాయతీ గాంధీభవన్ నుంచి డిల్లీకి మారడంతో జిల్లాలోని మెజారిటీ నియోజకవర్గాల నాయకులు ఇప్పటికే ఢిల్లీకి తమకు కలిసిన నేతల వద్ద గోడు చెప్పుకునే వచ్చారు తప్ప సీట్లపై గ్యారంటి మాత్రం రాలేదు. తమకు టికెట్ కావాలని కొంత మంది నేతలు ఢిల్లీలో అడగగా మరికొంత మంది లోకల్ నాన్ లోకల్ పంచాయతీలు పెట్టివచ్చారు. చెవెళ్ల ఆశావాహూలు ముగ్గురు కలిసి తమలో ఎవరికైన టికెట్ ఇవ్వాలి కాని ఇతరులకు ఇవ్వవద్దని ఫిర్యాదు చేయగా ఎల్.బి.నగర్ నేతలు సీనియర్ నేత, మాజీ ఎంపి మదుయాష్కికి టికెట్ ఇవ్వవద్దని ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇబ్రహింపట్నం సీటు పంచాయతీ కాకరేపుతుంది. మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి టి కెట్ ఖరారు అవుతుందని ప్రచారం జరుగుతున్న ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గీయుడు మర్రి నిరంజన్‌రెడ్డి, దండెం రాం రెడ్డి లాంటి నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తు టెన్షన్ పెడుతున్నారు. ముగ్గురిలో ఎవరికి టికెట్ వచ్చిన మరోకరు ఇతర పార్టీలు…ఇతర వ్యక్తులకు మద్దత్తు తెలపడం ఖాయంగా కనిపిస్తుంది. షాద్‌నగర్ సీటు వీర్లపల్లి శంకర్‌కు ఖాయమని ప్రచారం జరుగుతున్న వలసనేతలపై ఇంకా ఆశలు పెట్టుకున్నారు. చెవెళ్ల, ఎల్.బి.నగర్, ఇబ్రహింపట్నం, మహేశ్వరం సీట్ల పంచాయతీ పార్టీలో అలజడి రేపడం…రోడ్డున పడటం ఖాయం.

రేవంత్ ఇలాకాలో ఆగమాగం…
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎంపిగా ప్రాతినిత్యం వహిస్తున్న మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో హస్తం పార్టీ పరిస్థితి ఆగమాగంగా మారింది. ఎంపిగా రేవంత్‌రెడ్డిపై ఎన్నో ఆశలు పెట్టుకుని గెలిపిస్తే ఎనాడు కూడ క్షేత్రస్థాయిలో క్యాడర్‌కు అందుబాటులో లేకపోవడం…పార్లమెంట్ పరిధిలో అభివృద్ధ్దికి పెద్దపీట వేయకపోవడంతో జనం గుర్రుగా ఉన్నారు. పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో బలమైన నాయకులు లేకపోవడం సైతం పార్టీకి సమస్యగా మారింది. మేడ్చల్‌లో బిఆర్‌యస్ పార్టీ అభ్యర్థ్ది మల్లారెడ్డిని తట్టుకునే నాయకుడు కరువయ్యారు. స్థానిక నేతలు జంగయ్య యాదవ్….సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డిలలో ఒకరికి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతున్న మల్లారెడ్డిని తట్టుకుని విజయం సాధించడం అయ్యే పని కాదు. మాజీ ఎమ్మెల్యేపై ఆశలు పెట్టుకుని రాకకోసం ఎదురుచూస్తున్నారు.

మల్కాజ్‌గిరిలో మైనంపల్లిపై ఆశలు పెట్టుకున్నారు. ఉప్పల్‌లో వర్గపోరు రోడ్లపై పడి తన్నుకునే స్థాయిలో ఉంది. రాగిడి లకా్ష్మరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డిలలో ఒకరికి టికెట్ దక్కిన అధికార పార్టీ అభ్యర్ది బిఎల్‌ఆర్ ను తట్టుకుని గెలవడం సాద్యం అయ్యే పనికాదని ప్రచారం జరుగుతుంది. కూకట్‌పల్లి,కుత్బుల్లాపూర్‌లలో సిట్టింగ్ శాసనసభ్యులను తట్టుకుని విజయం వైపు పార్టీని నడిపించే నేతలు మాత్రం హస్తం పార్టీకి కరువయ్యారు. టికెట్ కోసం మాత్రం పదుల సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన సిట్టింగ్ శాసనసభ్యులు అర్ధిక,అంగ బలాల ముందు వారు కనుచూపుల్లో లేరు. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ సిట్టింగ్ శాసనసభ్యులకు కనీసం పోటి ఇచ్చే అశావాహూలు లేరని ప్రచారం జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News