Wednesday, May 15, 2024

ద్రోహులకు దేశభక్తే ఆఖరి రక్ష

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బిజెపిపై మంత్రి కెటిఆర్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అదానీ కుంభకోణం, హిండెన్‌బర్గ్ నివేదిక గురించి కనీస ప్రస్తావన చేసే దమ్ము కూడా లేదు గానీ, అదానీ మోసాలపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలంటూ బిలియనీర్ జార్జ్ సోరోస్ చేసిన కామెంట్స్‌పై మాత్రం ఉలిక్కి పడుతున్నారంటూ బిజెపి నేతలను ఉద్దేశించి కెటిఆర్ ట్వీట్ చేశారు.

అదానీ కుంభకోణం గురించి, హిండెన్ బర్గ్ నివేదిక గురించి కనీస ప్రస్తావన చేసే దమ్ము లేదు. కానీ, బిలియనీర్ జార్జ్ సోరోస్ కా మెంట్స్ చేయగానే వారి గురువును కాపాడుకునేందుకు చాలా ఆతృత కనబరుస్తున్నారు. వాళ్లది ఎంత దౌర్భాగ్యం..! వాళ్లు ఎంత బుద్ధి తక్కువ మనుషులు..!’ అంటూ మంత్రి ట్విట్టర్‌లో ఆశ్చర్యం కనబర్చారు. అదేవిధంగా, ‘ఈ వ్యాఖ్యలు ఎవరి గురించో చెప్పుకోండి..?’ అంటూ తన ట్వి ట్టర్ ఫాలోవర్‌లకు ప్రశ్న కూడా వేశారు. దానికి ‘ప్యాట్రియాటిజమ్ ఈజ్ ద లాస్ట్ రెఫుజీ ఆఫ్ ద స్కౌండ్రల్ (ద్రోహులకు దే శభక్తే ఆఖరి రక్ష)’ అన్న సామ్యేల్ జాన్సన్ సూక్తిని జతచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News