హైదరాబాద్: నకిలీ విత్తనాలు విక్రయిస్తు రైతులను మోసం చేస్తున్న ఇద్దరు నిందితులపై పిడి యాక్ట్ పెడుతూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎపిలోని గుంటూరు జిల్లా, అచ్చంపేట మండలం, తాలాచెరువు గ్రామానికి చెందిన ఏరువ సుధాకర్ రెడ్డి వ్యాపారం చేస్తున్నాడు. అన్నప్ప రెడ్డి రాజారెడ్డి హాస్టల్ వార్డెన్గా పనిచేస్తున్నాడు. ఇద్దరు నిందితులు కలిసి సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వెంకట్రెడ్డితో కలిసి విత్తనాలు విక్రయించారు. నకిలీ విత్తనాలను వెంకట్రెడ్డి ఫార్మ్ హౌస్లో నిల్వ చేసిన నిందితులు వాటిని అవసరం ఉన్నప్పుడు బయటికి తీసి విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసిన రైతులు నిండామునుగుతున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులకు రిమాండ్కు తరలించారు. తాజాగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ పిడి యాక్ట్ పెడుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
PD Act on person selling counterfeit seeds