Friday, May 3, 2024

ఆ కుటుంబానికి అండగా ఉంటాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: టిఆర్‌ఎస్ పార్టీ విద్యార్థి విభాగంతో పాటు పార్టీ కోసం సుదీర్ఘకాలం పనిచేసిన నల్గొండ జిల్లా చండూరు మండలానికి చెందిన దివంగత తిరుమణి కొండల్ కుటుంబాన్ని ఆదుకుంటామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి గత నెల క్రితం వరకు చికిత్స పొందుతూ మరణించిన కొండల్ కుటుంబం తమకు సహాయం అందించాల్సిందిగా బుధవారం తెలంగాణ భవన్‌లో కెటిఆర్‌ను కలిసింది. తన భర్త కొండల్ 2001 నుంచి పార్టీ కోసం పనిచేశారని, ఆయన మరణంతో తమ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిందని కెటిఆర్‌కు కొండల్ భార్య స్వాతి కన్నీరు పెట్టుకుంటూ వివరించారు.

స్వాతిని ఓదార్చిన కెటిఆర్ తగు సహాయం చేస్తామన్నారు. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి కర్నాటి విద్యాసాగర్‌కు ఆమె తగు న్యాయం చేయాలని కెటిఆర్ తగు ఆదేశాలు జారీ చేశారు. కొండల్ కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లల విద్యా విషయంలో సంపూర్ణ బాధ్యత తీసుకుంటానని కెటిఆర్‌కు విద్యాసాగర్ తెలియజేశారు.

Late Mrs Tirumani Kondal family meet KTR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News