Saturday, May 18, 2024

అన్నివర్గాలతో మాట్లాడి మేనిఫెస్టో తయారు చేశాం: దీపాదాస్ మున్షీ

- Advertisement -
- Advertisement -

అన్నివర్గాలతో మాట్లాడి మేనిఫెస్టో తయారు చేశారని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ అన్నారు. ఈ కమిటీలో ఉన్న అందరికీ ఆమె అభినందనలు తెలిపారు. బిజెపి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేరలేదని, ఆ పార్టీ నేతల నినాదాలు చూసి ప్రజలు భయపడుతున్నారని ఆమె ఆరోపించారు. సీబిఐ, ఈడీ, ఐటి దాడులతో విపక్ష నేతలు ఆందోళనకు గురవుతున్నారని ఆమె విమర్శించారు. దేశ ప్రజలకు న్యాయం జరగాలని రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టారని అన్నారు. దేశం బాగుండాలంటే రాహుల్ ప్రధాని కావాలని ప్రజలు కోరుతున్నారని దీపాదాస్ మున్షీ వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News