Saturday, July 27, 2024

హ్యాట్రిక్‌ కొట్టబోతున్నాం: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

ఎన్నికల్లో దేశం కోసం పనిచేసే ఎన్డీఏ, దేశంలో అస్థిరతను పెంచే ఇండియా కూటమి మధ్య పోరు జరుగుతోందని ప్రధాని మోడీ అన్నారు. దేశ ప్రజలు బీజేపీవైపే ఉన్నారని.. ఏన్డీఏ విజయం ఖాయమని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉత్తర ప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాన మోడీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. . మా ప్రభుత్వం హ్యాట్రిక్‌ కొట్టబోతుందన్నారు. గెలిచినత పేదల కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకోబోతున్నామని చెప్పారు. మీ ఓటు వల్లే రామమందిరం నిర్మాణం జరిగిందన్నారు. బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లే రామమందిరం సాధ్యమైందని ప్రధాని అన్నారు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపిస్తే.. వాళ్లు మోడీని తిట్టడమే పనిగా పెట్టుకుంటారన్నారు. తిట్టడం కోసం మనం ఎరినైనా ఎన్నుకుంటామా?.. అలాంటి వాళ్ల వల్ల పనులు జరుగుతాయా?..  మనకు పనులు చేసే వ్యక్తి కావాలని మోడీ అన్నారు.

 

హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో  కట్టుకున్న భార్తను సుఫారీ ఇచ్చి హత్యచేయించింది  ఓ భార్య.  గుండెపోటుతో మరణించాడని ఎవ్వరికీ అనుమానం రాకుండా  దహనసంస్కారాలు కూడా చేసింది.ఈ ఘటన జరిగిన మూడు నెలల తర్వాత నిందితుడు లొంగిపోవడంతో అసలు విషయం బయటపడింది.

మధురానగర్ పోలీసులు వెల్లడించిన  వివరాల ప్రకారం.. ఎహైదరాబాద్ లోని ఎల్లారెడ్డి గూడలో   జయప్రకాశనగర్ లోని శిఖర అపార్డ్ మెంట్ లో  నివాసం ఉండే సీసీ కెమెరా టెక్నీషియన్ విజయ్ కుమార్(40)కు భార్య శ్రీలక్ష్మి (33), ఇద్దరు మగ పిల్లలు (9, 8 ఏండ్లు) ఉన్నారు. కొంత కాలంగా బోరబండకు చెందిన రాజేశ్ (30)తో శ్రీలక్ష్మి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. వీళ్ల బంధానికి తన భర్త అడ్డుగా ఉన్నాడని   భావించిన శ్రీలక్ష్మి  ప్రియుడితో కలిసి మర్డర్ కు ప్లాన్ చేసింది.  భర్త పేరు మీద మేడ్చల్, ఎల్లారెడ్డిగూడలో సొంత ఇండ్లు ఉన్నాయి. భర్తను హత్య  చేయించి ఎంజాయ్ చేద్దాం అనుకుంది.  ఎల్లారెడ్డిగూడలో ఉంటున్న ఇల్లు వాస్తు బాగో లేదని చెప్పి శిఖర అపార్టమెంట్ కు  మకాం మార్పించి మర్డర్ కు ప్లాన్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News