Tuesday, April 16, 2024

యూనివర్సిటీలో పిజి విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Suicide

 

చెన్నై: పిజి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులోని పెరియార్ యూనివర్సిటీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నివేదిత అనే అమ్మాయి ఎంఎస్‌సిలో బోటనీ చదువుతోంది. నివేదిత రెండు రోజుల నుంచి ఎవరితో సరిగా మాట్లాడడం లేదు. సరే తోటి విద్యార్థులు ఆమెను పట్టించుకోకుండా కాలేజీ వెళ్లారు. తోటి విద్యార్థులు లేని సమయంలో డోర్ లాక్ చేసుకొని ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయింది. దీంతో సాయంత్రం హాస్టల్ వచ్చి రూమ్ డోర్ తడితే తెరవకపోవడంతో సిబ్బందికి సమాచారం ఇచ్చారు. డోర్ బద్దలు కొట్టి చూడగా ఆమె ఉరేసుకుంది. విద్యార్థుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేశారు. సూసైడ్ లెటర్‌లో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నానని రాసింది. కానీ ప్రొఫెసర్ లైంగిక వేధింపులతో నివేదిత ఆత్మహత్య చేసుకుందని యూనివర్సిటీ విద్యార్థులు ధర్నాకు దిగారు. గతంలో బోటనీ ప్రొఫెసర్ ఆమెను లైంగికంగా వేధించడంతో యూనివర్సిటీ విసికి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఆ ప్రొఫెసర్ మళ్లీ వేధించడంతోనే సదరు విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని విద్యార్థులు ఆరోఫణలు చేస్తున్నారు. ప్రొఫెసర్ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News