- Advertisement -
రాజన్న సిరిసిల్ల : మద్యం మత్తులో బైక్ పై రయ్యిన దూసుకుపోతు, ఈలలు వేస్తు గోల చేస్తున్న ఇద్దరు యువకులకు పోలీసులు బడితపూజ చేసిన ఘటన సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని చంద్రంపేటలో చోటుచేసుకుంది. ఫుల్లుగా మందుకొట్టి ఈల వేస్తూ పాటలు పాడుతూ బైక్ నడుపుతున్నారు. మనుషులు ఊగుతున్నారు. బండి ఊగుతోంది. వీరి చేష్టల్ని గమనించిన పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు. పొడవాటి కర్రతో మత్తు దిగేవరకు చితక్కొట్టారు. వద్దు సార్ అంటూ ఏడుస్తూ వేడుకున్నా వారిని పోలీసులు వదల్లేదు. కర్ర విరిగేవరకు కొట్టారు. బూటు కాలితో ఆ యువకులకు చుక్కలు చూపించారు. ఈ తతంగం మొత్తాన్ని అక్కడే ఉన్న కొందరు యువకులు వీడియో తీశారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.
Police beat up youngsters in Rajanna siricilla
- Advertisement -