Thursday, May 2, 2024

13 నియోజకవర్గాల్లో గంట ముందే పోలింగ్ ముగింపు

- Advertisement -
- Advertisement -

సమస్యాత్మక కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సమస్యాత్మకంగా ఉన్న 13 నియోజకవర్గాల్లో గంట ముందుగానే పోలింగ్ ముగించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకే పోలింగ్ జరగనుంది. మిగతా 106 స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనున్నట్లు నోటిఫికేన్ జారీ చేసింది.

నవంబర్ 30వ తేదీన జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సోమవారం ఎన్నికల నిర్వహణపై ఈసీఐ రాష్ట్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు, నగదు సీజ్‌పై ఈసీ ఆరా తీయగా ఎన్నికల ఏర్పాట్లపై సీఈవో వికాస్ రాజ్ ఈసీఐకి వివరాలు వెల్లడించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పై అధికారులకు ఈసీఐ పలు సూచనలు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News