Sunday, April 28, 2024

ప్రగతి భవన్ వద్ద బారికేడ్ల తొలగింపు

- Advertisement -
- Advertisement -

నిన్న మొన్నటివరకూ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న ప్రగతి భవన్ వద్ద మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మారుస్తామని రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ వద్ద బారికేడ్లను పోలీసులు తొలగిస్తున్నారు. ఇప్పటివరకూ ప్రగతి భవన్ వద్ద అమలులో ఉన్న ట్రాఫిక్ ఆంక్షలను సైతం ఎత్తివేశారు. ప్రగతి భవన్ వద్ద బారికేడ్లు రోడ్డులో సగభాగాన్ని ఆక్రమించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడేది. ఇప్పుడు ఆ అడ్డంకులు తొలగిపోనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News