సాయి తేజ్, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్లో విజయోత్సవ సంబరాలను జరుపుకుంది. చిత్ర యూనిట్ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ “మారుతి నాకు ఈ కథ చెప్పినప్పుడు… ‘సందేశముంది కానీ యూత్ఫుల్ ఎలిమెంట్స్ లేవు కదా’అని అన్నాను. కానీ మారుతి నమ్మకాన్ని చూసి ఈ సినిమాను ప్రారంభించాం. షూటింగ్ పూర్తయ్యాక సినిమా చూస్తున్నంత సేపు నవ్వుకుంటూనే ఉన్నాం. థియేటర్స్లో ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఏడాది చివరలో సాయి తేజ్ మంచి సక్సెస్ కొట్టాడు”అని అన్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మాట్లాడుతూ “మారుతి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.
ఈ సినిమా విజయం సాధించడంలో అల్లు అరవింద్ ప్రాధాన్యత ఉంది. ఈ కథ విన్నపుడే నేను ఈ సినిమా విజయాన్ని ఊహించాను”అని చెప్పారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ “ఈ సినిమా కథ రాసుకున్నపుడే రాజమండ్రిలో షూట్ చేయాలని అనుకున్నాను. అప్పుడే సక్సెస్మీట్ని కూడా అక్కడే చేయాలని అనుకున్నాను. పేరెంట్స్ని మిస్ అవుతున్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా చేయాలనే ఆలోచన మొదట సాయి తేజ్లో పుట్టింది. కథను డెవలప్ చేయగానే అల్లు అరవింద్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలాంటి సక్సెస్లు ఇంకా మరిన్ని మంచి సినిమాలు తీసేలా బలాన్ని చేకూరుస్తాయి”అని పేర్కొన్నారు. హీరో సాయి తేజ్ మాట్లాడుతూ “ప్రతిరోజు పండగే సినిమా నా కెరీర్లోనే ముఖ్యమైనది. మా సినిమాకు చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. థియేటర్లో సినిమాను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు”అని అన్నారు. ఈ కార్యక్రమంలో తమన్ , బన్నీవాసు తదితరులు పాల్గొన్నారు.