Thursday, May 2, 2024

తీర రక్షణకు “ఐఎన్‌ఎస్ వింధ్యగిరి”

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : భారత నౌకాదళంలో సేవలందించనున్న సరికొత్త యుద్ధనౌక “ఐఎన్‌ఎస్ వింధ్యగిరి” ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించారు. పశ్చిమబెంగాల్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కోల్‌కతా లోని హుగ్లీ నది ఒడ్డునున్న గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అధునాతన స్టెల్త్ యుద్ధ నౌకను నౌకాదళం లోకి ప్రవేశ పెట్టారు.

వింధ్యగిరి కర్ణాటక రాష్ట్రం లోని ఓ పర్వత శ్రేణి పేరు. ప్రాజెక్ట్ 17 ఏ లో భాగంగా రూపొందించిన ఆరో యుద్ధ నౌక ఇది. ఇదే పేరుతో గతంలో ఉన్న యుద్ధ నౌక 31 ఏళ్ల పాటు సేవలందించింది. 2012 దాకా అది పలు క్లిష్టతరమైన ఆపరేషన్లలో పాల్గొని సత్తా చాటింది. ఈ ఐఎన్‌ఎస్ వింధ్యగిరిలో సరికొత్త గ్యాడ్జెట్‌లను అమర్చనున్నారు. దీనిని నౌకాదళానికి అప్పగించే ముందు విస్తృత స్థాయిలో వివిధ రకాలుగా పరీక్షించి చూస్తామని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా పీ17ఏ నౌకలన్నీ గైడెడ్ మిస్సైల్ సామర్థం కలిగి ఉన్నాయి.

ఒక్కో నౌక పొడవు 149 మీటర్లు ఉంటుంది. 6670 టన్నుల బరువుతో ఇవి 28 నాట్స్ వేగంతో ప్రయాణించగలవని ఓ అధికారి తెలిపారు. ఇవి శివాలిక్ క్లాస్ ప్రాజెక్టు 17 యుద్ధ నౌకల కంటే మెరుగైనవని చెప్పారు. అధునాత ఆయుధాలు, సెన్సార్లు , ప్లాట్‌ఫామ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లు, వీటిలో పొందుపర్చనున్నట్టు వెల్లడించారు భూమి, ఆకాశం , నీటి లోపల నుంచి ఎదురయ్యే సవాళ్లకు ఇవి దీటుగా బదులిస్తాయని రక్షణ శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News