Tuesday, June 3, 2025

రేషన్ దుకాణాల వద్దే పంపిణీ చేస్తే అక్రమాలు తగ్గుతాయి: నిమ్మల

- Advertisement -
- Advertisement -

అమరావతి: కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) మహిళా లబ్దిదారులకు బియ్యం, చీర అందజేశారు. పాలకొల్లులో  శ్రీనివాస్ వర్మతో కలిసి రేషన్ పంపిణీని ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా నిమ్మల మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఒక సెంటర్ లో వ్యాను ఆపి.. అక్కడే రేషన్ పంపిణీ చేసేవారని అన్నారు. గత ప్రభుత్వం ఇంటి వద్దకి రేషన్ పంపిణీ (Ration distribution home) చేయలేదని, రేషన్ తీసుకోవాలంటే పనులు మానుకోవాల్సి వచ్చేదని అన్నారు. రేషన్ బియ్యం అక్రమాలు చేసి, వేల కోట్లు దారి మళ్లించారని మండిపడ్డారు. రేషన్ దుకాణాల వద్దే పంపిణీ చేయడం వల్ల అక్రమాలు తగ్గుతాయని చెప్పారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకుల పంపిణీ జరుగుతుందని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News