Monday, May 13, 2024

సిఆర్ రావు పరిశోధనలివే…

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : భారత్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత గణాంక , గణిత శాస్త్రవేత్త కల్యంపూడి రాధాకృష్ణారావు అమెరికాలో అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. గణిత శాస్త్రంలో అందించిన సేవలకు గాను స్టాటిస్టిక్స్ రంగంలో అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. భారత ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్‌తో సత్కరించింది.

సిఆర్ రావు పరిశోధనలివే…
సీఆర్ రావు తన పరిశోధనల్లో భాగంగా 1945లో మూడు ప్రాథమిక ఫలితాలను విశ్లేషించారు. ఇవి ఆధునిక గణాంక విధానానికి మార్గం సుగమం చేయడంతోపాటు సైన్స్‌లో ఈ గణాంక టూల్స్‌ను భారీగా వాడడానికి ఉపయోగపడ్డాయి. ఈ మూడింటిలో మొదటిది , క్రామెర్ రావు లోయర్ బౌండ్. ఇది గణాంక పరిమాణాన్ని అంచనా వేయడంలో అత్యుత్తమ విధానాన్ని సూచించింది. రెండవది రావుబ్లాక్‌వెల్ సిద్ధాంతం. ఒక అంచనాను మెరుగైనదిగా మార్చడానికి ఉపయోగపడుతోంది. మూడోది సమాచార జామెట్రీ విస్తృతికి కొత్త ఇంటర్ డిసిప్లినరీ ఫీల్డ్ అభివృద్ధి. ఇది డేటా నుంచి సమాచారాన్ని మరింత సమర్ధంగా సేకరించేందుకు సహాయ పడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News