Friday, May 3, 2024

చేరికలను అడ్డుకోవద్దు.. హద్దు మీరితే చర్యలు తప్పవు

- Advertisement -
- Advertisement -

చేరికలను అడ్డుకోవద్దు.. రాహుల్ ఆదేశం
హద్దుమీరితే చర్యలు తప్పవు..కాంగ్రెస్ నేతలకు హెచ్చరిక
ఐదేళ్లు పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రమోషన్, పార్టీలో చేరినవారికి టికెట్ల హామీ ఇవ్వలేదు
నలుగురు అగ్రనేతలు డుమ్మా.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ సీరియస్
మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికలకు ముందు చేరికలతో కాంగ్రెస్‌లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. కానీ మరోవైపు నియోజకవర్గాల్లో నేతలు మాత్రం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎవరిపై పోరాడామో వారితో కలిసి పనిచేయడం తమ వల్ల కాదని తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చేరికలను అడ్డుకుంటే చర్యలు తప్పవని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాగూర్ హెచ్చరించారు. పిసిసి కార్యవర్గ సమావేశంలో పార్టీలో చేరికపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ క్లారిటీ ఇచ్చారు. రాహుల్ గాంధీ ఆదేశాలతోనే పార్టీలో చేరికలు జరుగుతున్నట్లు తెలిపారు. చేరికలను ఎవ్వరూ అడ్డుకోవద్దని పార్టీలో ఇంకా ఒకరిద్దదరు అంతర్గత విషయాలపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇకపై ఎవరైనా మాట్లాడితే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఐదేళ్లు పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రమోషన్ ఇస్తామని తెలిపారు. పార్టీలో చేరిన ఎవ్వరికి కూడా టికెట్లకు సంబంధించిన హామీ లేదని ఆయన నేతలకు వివరించారు. అలాగే ఆగస్టు మొదటి వారంలో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు సంబంధించిన అంశాలపైనా క్లారిటీ ఇచ్చారు. గాంధీభవన్‌లో పిసిసి కార్యవర్గ సమావేశం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ అధ్య క్షతన శనివారం జరిగింది. కాగా, ఈ సమావేశానికి సీనియర్ నేతలు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీ గౌడ్ గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. ప్రధానంగా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలపై చర్చ జరిగింది.

టి కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. పార్టీలో చేరికలపై ఇటీవలి కాలంలో నేతల మధ్య విభేదాలు తలెత్తిన సంగతి విదితమే. గీత దాటిన నేతలను లైన్‌లో పెట్టేందుకు అధిష్టానం సిద్ధమైంది. దీనిలో భాగంగా ముఖ్య నేతలతో ఠాగూర్ సమావేశమయ్యారు. అయితే చేరికలపై కొందరు నేతలు అసంతృప్తిగా ఉండటంతో కొత్త పంచాయతీలు తెరపైకి వస్తున్నాయి. అధికార టిఆర్‌ఎస్ నుంచి వచ్చే నేతలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చేందుకు హస్తం పార్టీ సుముఖత వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఓదెలు ఆయన సతీమణితో పాటు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవలే పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి, అశ్వా రావుపేట మాజీ ఎంఎల్‌ఎ తాటి వెంకటేశ్వర్లు కూడా పిసిసి చీఫ్ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఇదిలా ఉంటే ఖమ్మం జిల్లా నేతలు కాంగ్రెస్‌లో చేరడం ఆ పార్టీ శ్రేణుల్లో కొంత అసంతృప్తికి కారణమైంది. సిఎల్‌పి నేత భట్టి విక్రమార్కకు ఎలాంటి సమాచారం లేకపోవడం చర్చ నీయాంశమైంది. దీనిపై అశ్వారావుపేట కాంగ్రెస్‌నేతలు భట్టికి ఫిర్యాదు చేశారు. ఇక తుంగతుర్తి ఇంఛార్జి అద్దంకి దయాకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన డాక్టర్ రవి పిసిసి చీఫ్ రేవంత్‌ను కలిసేందుకు వెళ్లగా ఆయన భేటీకి నిరాక రించారు. ఇకపోతే.. మొన్న కాంగ్రెస్‌లోకి మాజీ ఎంఎల్‌ఎ ఎర్రశేఖర్ వచ్చారు. రేవంత్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే, ఎర్ర శేఖర్‌చేరికను కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నేర చరిత్ర కలిగిన ఎర్ర శేఖర్‌ను పార్టీలోకి ఎలా చేర్చుకుంటారని ప్రశ్ని స్తున్నారు. గాంధీ సిద్ధాంతాలను నమ్మే కాంగ్రస్‌లోకి నేరగాళ్లు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రశేఖర్ చేరికపై అధిష్టానానికి ఫిర్యాదు చేసే యోచనలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నారు. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి గీతారెడ్డి కూడా చేరికను సమర్థించారు.

Rahul Gandhi warns to TS Congress leaders over joinings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News