- Advertisement -
రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వ్యవసాయ వర్సిటీ సమీపంలో బెంగుళూరు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుర్తు తెలియని మృతదేహం రక్తం మడుగులో పడి ఉంది. అతి కిరాతకంగా కత్తితో గొంతుకోసి హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేసినట్లుగా పోలీసుల అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీ సాయంతో ఆధారాల సేకరిస్తున్నారు. వరుస హత్యాలతో స్థానికులు బెంబేలెత్తుతున్నారు. గత వారం మహిళను అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. మంగళవారం మైలార్ దేవుపల్లిలో ఓ వ్యక్తిని హత్య చేసేందుకు సుపారీ తీసుకున్న విషయం విధితమే.
Also Read: స్థానిక సమరం… రిజర్వేషన్లు ఖరారు?
- Advertisement -