Saturday, May 4, 2024

రాజ్‌నాథ్ సియాచిన్ సందర్శన

- Advertisement -
- Advertisement -

సైన్యం సన్నద్ధతపై సమీక్ష
మంత్రివెంట ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ : ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌ను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం సందర్శించారు. ఆ ప్రాంతంలో భారత సమగ్ర సైనిక సన్నద్ధతను మంత్రి సమీక్షించారు. భారతీయ సైన్యం వ్యూహాత్మకంగా కీలక ప్రాంతమైన సియాచిన్‌లో 40వ తన ఉనికి వార్షికోత్సవం జరుపుకున్న తరువాత వారానికి రాజ్‌నాథ్ సింగ్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేతో కలసి వచ్చిన రాజ్‌నాథ్ సింగ్ ఆ ప్రాంతంలో భద్రత పరిస్థితిని సమీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. సియాచిన్‌లో మోహరించిన జవాన్లతో రాజ్‌నాథ్ ముచ్చటించారు కూడా. తన ‘ఆపరేషన్ మేఘ్‌దూత్’ కింద భారతీయ సైన్యం 1984 ఏప్రిల్‌లో సియాచిన్‌పై పూర్తి ఆధిపత్యం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News