Tuesday, April 30, 2024

రోహిత్, గిల్ ఔట్… టీమిండియా 280/3

- Advertisement -
- Advertisement -

ధర్మశాల: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 63 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 280 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత జట్టు వరస ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది. రోహిత్ 103 పరుగులు చేసి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. శుబ్ మన్ గిల్ 110 పరుగులు చేసి అండర్సన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. తొలి వికెట్‌పై రోహిత్-గిల్ 171 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో సర్ఫరాజ్ ఖాన్(02), దేవదూత్ పడిక్కల్(4) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే భారత జట్టు 62 పరుగుల ఆధిక్యంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News