Saturday, July 27, 2024

హైదరాబాద్ పోలీసులకు షాకిచ్చిన సామాన్యుడు..

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనాదారులకు పోలీసులు భారీ జరిమానా విధిస్తూ షాకిస్తుంటారు.. కానీ ఇక్కడ ఓ సామాన్యుడే పోలీసులకు షాక్ ఇచ్చాడు. ఏం జరిగిందంటే.. గత బుధవారం నగరంలోని ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఓ పోలీసు వాహనం ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా రాంగ్ రూట్లో వెళ్లింది. దీన్ని గమనించిన ఓ వ్యక్తి వెంటనే తన ఫోన్ లో ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చివరికి ఆ ఫోటో రాచకొండ కమీషనరేట్ కు చేరింది. దీంతో స్పందించిన రాచకొండ పోలీసులు టిఎస్‌09పిఎ4083 నెంబర్‌ గల పోలీస్ వాహనానికి రూ.1135 జరిమానా వేశారు. ఈ విషయాన్ని ట్వీట్టర్ ద్వారా తెలియజేశారు.

Rs.1,135 Fine imposed on police vehicle in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News