- Advertisement -
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి చెప్పినట్లుగానే రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులను వేగంగా జమ చేస్తోంది. వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభం అయ్యే నాటికి ఈ పథకాన్ని అమలు చేయడం ప్రారంభించారు. దీనిలో భాగంగా ఈ నెల 16 సోమవారం రెండు ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్న రైతులందరి ఖాతాల్లోకి ఎకరానికి రూ.6 వేల చొప్పున నిధులను ప్రభుత్వం జమ చేసింది. మంగళవారం మూడు ఎకరాల వరకు, బుధవారం నాలుగు ఎకరాల వరకు ఉన్న రైతులందరి ఖాతాల్లో నిధులు జమ చేశారు. గురువారం 5 ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో నిధుల జమ చేసింది. 4,43,167 మంది రైతుల ఖాతాల్లో రూ.1,189 కోట్లు జమ చేసింది. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన అర్హులైన రైతులందరికి రైతు భరోసా అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం.
- Advertisement -