Sunday, June 22, 2025

ఆ హీరోయిన్‌పై కోపం.. సందీప్ వంగా ఈ విధంగా చూపించారా..?

- Advertisement -
- Advertisement -

తీసిన సినిమాలు తక్కువే అయినా.. యూత్‌లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). అర్జున్ రెడ్డి సినిమాతో కొత్త ట్రెండ్ సెట్ చేసిన ఆయన.. ఆ తర్వాత రణ్‌బీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే సినిమాతో బాక్సాఫీస్‌ని షేక్ చేశారు. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌తో కలిసి ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా ప్రారంభానికి ముందే చిన్న కాంట్రవర్సీలో చిక్కుకుంది. ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్‌ని తీసుకోవాలని భావించగా.. కొన్ని కండీషన్స్ వల్ల ఆమెను ప్రాజెక్టు నుంచి తప్పించారు.

అయితే ఈ విషయంపై సందీప్ (Sandeep Reddy Vanga) తీవ్రంగా స్పందించారు. తను ఆ హీరోయిన్‌ను నమ్మి స్టోరీ మొత్తం చెప్పానని.. దర్శకులు నటీనటులకు కథ నెరేట్‌ చేశారంటే వారి మధ్య అనధికారిక నాన్ డిస్‌క్లోజర్‌ అగ్రిమెంట్‌ ఉన్నట్లే.. కానీ, ఆ హీరోయిన్ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి స్టోరీ లీక్ చేసే ప్రయత్నం చేస్తోందని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ తెగ వైరల్ అయింది. నటి దీపికా పదుకొణె గురించే ఈ పోస్ట్ పెట్టారని టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే ఇప్పుడు సందీప్ పెట్టిన మరో పోస్ట్ కూడా వైరల్ అవుతోంది.

తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ అనే పేరుతో సందీప్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలైన ఆరు సంవత్సరాలు పూర్తి కావొస్తుంది. ఈ సందర్భంగా సందీప్ హీరో షాహిద్ కపూర్ లేకుండా.. కేవలం హీరోయిన్ కియారా అడ్వాణీ ఫోటోని పోస్ట్ చేసి.. విషెస్ చెప్పారు. దీంతో ఇది మళ్లీ చర్చకు దారి తీసింది. స్టార్ హీరోయిన్‌తో వివాదం వేళ కియారాను ప్రశంసించేందుకే సందీప్ ఈ విధంగా చేసి ఉంటారని పలువురు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News