హోబర్ట్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రెండో ఇన్నింగ్స్ను విజయంతో ప్రారంభించింది. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ రాకెట్ చేతపట్టిన సానియా ఆడిన తొలి మ్యాచ్లోనే విజయాన్ని అందుకుంది. హోబర్ట్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా డబుల్స్ విభాగంలో బరిలోకి దిగింది. మంగళవారం జరిగిన మొదటి రౌండ్లో సానియా జంట జయభేరి మోగించింది. ఉక్రెయిన్కు చెందిన నడియా కిచెనోక్తో కలిసి డబుల్స్లో బరిలోకి దిగిన సానియా తొలి రౌండ్లో విజయం సాధించింది. మూడు సెట్ల పోరాటంలో సానియా జంట చెమటోడ్చి నెగ్గింది. ఒక్సానా (జార్జియా)మియు కటో (జపాన్) జంటతో జరిగిన మ్యాచ్లో సానియా జోడీ 26, 76, 103తో విజయాన్ని అందుకుంది.
తొలి సెట్లో సానియానడియా జంటకు పరాజయం ఎదురైంది. ప్రత్యర్థి జంట అద్భుత ఆటతో పైచేయి సాధించింది. దూకుడుగా ఆడుతూ అలవోకగా సెట్ను సొంతం చేసుకుంది. తర్వాతి సెట్లో కూడా పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఈసారి చివరి వరకు నిలకడగా ఆడిన సానియా జంట విజయాన్ని అందుకుంది. ఇక, ఫలితాన్ని తేల్చే మూడో సెట్లో కూడా సానియా పైచేయి సాధించింది. ఆఖరు వరకు ఆధిపత్యాన్ని చెలాయిస్తూ సెట్తో పాటు మ్యాచ్ను దక్కించుకుని ముందంజ వేసింది.
Sania Mirza Makes Winning Return to Tennis