సంక్రాంతి కానుకగా విడుదలైన సూపర్స్టార్ మహేష్ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ చిత్రం 200 కోట్ల రియల్ గ్రాస్ కలెక్షన్స్ను సాధించి సంక్రాంతి రియల్ ఛాంపియన్గా నిలిచిందన్నారు ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర. మహేష్ బాబు హీరోగా దిల్రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’.
రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ప్రొఫెసర్ భారతీగా లేడీ అమితాబ్ విజయశాంతి పవర్ఫుల్ పాత్రలో నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ “మహేష్బాబు కెరీర్లోనే ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్బ్టర్ హిట్గా నిలిచింది. మా చిత్రాన్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులు, సూపర్స్టార్ కృష్ణ, మహేష్ అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు”అని అన్నారు.