Saturday, April 27, 2024

కాంగ్రెస్‌లో చేరిన సతీష్ మాదిగ

- Advertisement -
- Advertisement -

బిజెపి అనుసరిస్తున్న విధానాలు నచ్చకే ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరినట్టు బిజెపి కార్యవర్గ సభ్యులు సతీష్ మాదిగ తెలిపారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరులతో సతీష్‌ మాదిగ మాట్లాడుతూ తాను బిజెపి కార్యవర్గ సభ్యుడిగా పని చేశానని, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట బిజెపి అభ్యర్థిగా పోటీ చేశానని ఆయన తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు అన్ని విధాలా అభివృద్ధి కోసం కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా పేద బడుగు, బలహీన వర్గాలను,

మాదిగలను సంఘటితం చేసి నాగర్‌కర్నూల్ పార్లమెంట్ తో పాటు రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కృషి చేస్తానని సతీష్ మాదిగ అన్నారు. ఆదివారం ఉదయం టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపి డా.మల్లురవి ఆధ్వర్యంలో బిజెపి కార్యవర్గ సభ్యులు సతీష్ మాదిగ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సతీష్ మాదిగతో సుదీర్ఘంగా చర్చలు జరిపి తనకు ఎన్నికల్లో మద్దతు తెలపాలని మల్లురవి కోరారు. మల్లురవి అడిగిన వెంటనే సతీష్ మాదిగ సానుకూలంగా స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News