- Advertisement -
శేరిలింగంపల్లి జిహెచ్ ఎంసి కార్యాలయంలో గురువారం ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.15 వేలు లంచం తీసుకుంటున్న ట్యాక్స్ ఇన్స్పెక్టర్ యాదగిరి, అసిస్టెంట్ సాయిలను రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. ఓ వ్యక్తి నుంచి భవనం నిర్మాణ అనుమతి కోసం యాదగిరి రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. సదరు వ్యక్తి నుంచి గతంలో రూ.15 వేలు తీసుకున్న యాదగిరి.. మిగిలిన రూ.15 వేలు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. జీహెచ్ ఎంసి కార్యాలయంలో అధికారులు ఇంకా సోదాలను కొనసాగుతున్నారు.
Serilingampally GHMC Tax Inspector, Assistant in ACB Net
- Advertisement -