Sunday, April 28, 2024

23 స్థానాల్లో పోటికి దిగుతాం:శివసేన

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్రలో శివసేన (యుబిటి) 23 లోక్‌సభ స్థానాలలో పోటీచేస్తుంది. ఈ విషయాన్ని పార్టీ నేత సంజయ్ రౌత్ శుక్రవారం తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇండియా కూటమి భాగస్వామ్యపక్షాలత ఈ వారంలోనే ఢిల్లీలో విస్తృతస్థాయి చర్చలు జరిగాయని వివరించారు. ఈ భేటీలో తమ పార్టీ నేత ఉద్ధవ్ థాకరే, ఆదిత్యా థాకరే ఇతరులు కాంగ్రెస్ నేతలు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో , పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌లతో సమావేశం అయ్యారని తెలిపారు.

ఇప్పటికే చాలా ఏళ్లుగా తాము 23 స్థానాల్లో పోటీకి దిగుతున్నామని, ఇది ఈసారి కూడా సాగుతుందని రౌత్ చెప్పారు. కాగా ఎన్‌సిపి, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని సీట్లకు పోటీపడుతాయి? వీటి మధ్య ఎటువంటి సర్దుబాట్లు ఉంటాయనేది తాను చెప్పలేనని తెలిపారు. కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాట్ల విషయం ఏదైనా ఢిల్లీలో జరగాల్సిందేనని, ఎందుకంటే రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నేత ఎవరూ సొంత నిర్ణయం తీసుకోవడం కుదరదని , వారు ప్రతి విషయానికి ఢిల్లీకి వెళ్లాల్సిందే, అక్కడ చర్చించాల్సిందే అని రౌత్ చమత్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News