Sunday, April 28, 2024

శామీర్ పేటలో గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం భారీగా గంజాయి పట్టబడింది. గంజాయి తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు కార్లలో తరలిస్తున్న 272 కిలోల గంజాయిన పోలీసులు పట్టుకున్నారు. గంజాయి విలువ రూ. 80 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల వద్దనుంచి సెల్ ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఎక్కడ నుంచి తీసుకోచ్చారు. ఎవరికి అమ్ముతున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News