Saturday, April 27, 2024

నకిలీ సర్టిఫికెట్ల రాకెట్‌ను ఛేదించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ పోలీసులు అరెస్టు చేసింది. నిందితులు రాంనగర్‌కు చెందిన ఎం.రవి (40), మంచిర్యాలకు చెందిన నౌషాద్ (36)లు నకిలీ సర్టిఫికెట్లను విక్రయిస్తూ రూ.1.5 లక్షలకు పైగా వసూలు చేస్తున్నారు.

జార్ఖండ్‌లోని క్యాపిటల్ యూనివర్సిటీ, ఉత్తరప్రదేశ్‌లోని వీబీఎస్ పూర్వాంచల్ యూనివర్శిటీ, ఢిల్లీలోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్, ఢిల్లీలోని రాజీవ్ గాంధీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్, వారణాసిలోని మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్‌తో సహా పలు ప్రముఖ సంస్థల నుంచి నకిలీ సర్టిఫికెట్లను పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. స్వాధీనం చేసుకున్న వస్తువులలో నకిలీ మెమోలు, సిఫార్సు లేఖలు, మైగ్రేషన్ సర్టిఫికెట్లు ఉన్నాయి. నిందితుడి వద్ద నకిలీ ప్రైవేట్ బ్యాంక్ సర్టిఫికెట్, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను మేడిపల్లి పోలీసులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News