Thursday, April 25, 2024

శివరాత్రి ఉత్సవాల్లో ఆరుగురు పీఠాధిపతులు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Harish rao

 

సిద్దిపేట: మూడు రోజుల పాటు సిద్దిపేటలో ఘనంగా మహా శివరాత్రి ఉత్సవాలు జరుపుతామని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మహాశివరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక, గోడ పత్రికను మంత్రి ఆవిష్కరించారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి ఆరుగురు పీఠాధిపతులు ఉత్సవాల్లో పాల్గొంటారని సూచించారు. ప్రతీ భక్తుడు శివలింగానికి అభిషేకం, బిల్వార్చన చేసేలా ఏర్పాట్లు చేశామని, శివరాత్రి జాగారానికి సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఏర్పాటు చేశామని హరీష్ వెల్లడించారు. భక్తుల సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలియజేశారు.

 

Six Pitadipatuluu attend Shiva ratri Celebrations
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News