Thursday, May 2, 2024

చందన్ వెల్లికి పరిశ్రమల వెల్లువ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/షాబాద్: ఉత్పత్తి రంగంలో ప్రపంచానికే జపాన్ ఆదర్శమని, వెళ్లిన ప్రతిసారి కొత్త అంశాలను నేర్చుకుంటామని.. అవసరమైతే చందనవె ల్లిలో జపాన్ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటి, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కె. తా రక రామారావు పేర్కొన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్‌పల్లి పారిశ్రామిక వాడలో జపాన్‌కు చెందిన డైఫుకు ఇం ట్రాలాజిస్టిక్స్ యూనిట్, నికోమాక్ తైకిషా క్లీన్ రూమ్స్ కంపెనీలను ఏర్పాటుకు శంకుస్థాపన చే శారు. టిఎస్ ఐపాస్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని దీని ద్వారా పరిశ్రమల ఏర్పాటుతో యు వతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ మాట్లాడుతూ అణుబాంబు దాడిని ఎదుర్కొని కూడా తిరిగి లే చి నిలిచి జపాన్ సత్తా చాటిందన్నారు. మన దే శంలో ప్రతి ఇంట్లో ఆ చెందిన వస్తువు ఏదో ఒకటి ఉంటుందన్నారు.

భవిష్యత్తులో ఆ చెందిన మరిన్ని కంపెనీలు రాష్ట్రానికి వ స్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. డైఫుకు కం పెనీ దేశంలో అగ్రగామిగా నిలుస్తుందని ఆ సం స్థ్ద రూ.575 కోట్ల పెట్టుబడితో ప్రారంభించినట్లు మూడు నెలల్లో పరిశ్రమ ప్రారంభ కానుందనది, చందనవెల్లికి వెల్‌స్పన్, మైక్రోసాఫ్ట్ సహా అనేక సంస్థలు వస్తాయని వెల్లడించారు. ఈ ద్వారా ప్రత్యక్షంగా 1600 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. భారత్‌కు చెందిన వెగా కన్వేయ ర్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీతో కలిసి డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ కంపెనీ ఎక్విప్‌మెంట్ యూని ట్ ఏర్పాటు చేస్తుందన్నారు. మొదటి విడతలో రూ. 200 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు, దీని ద్వారా 800 మందికి జీవనోపాధి లభిస్తుందని, మొదటి దశలో 250 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. దీనిలో కన్వేయర్స్, షార్టర్స్ ఉత్పత్తి చేయనుందని చెప్పారు. అదేవిధంగా నికోమాన్ తైకిషాకు వందేళ్లకు పైగా చరిత్ర ఉందని, నిర్మాణ రంగానికి చెందిన క్లీన్ రూమ్స్ ఉత్పత్తులను తయారు చేస్తుందన్నారు. హెచ్‌వీఏసీ సిస్టమ్స్‌ను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో రూ. 126.20 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేస్తుందని,

దీనికి సంబంధించి ప్రభుత్వంతో గతేడాదిలో ఒప్పందం చేసుకుందని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలోని ఐటిఐని ఈ సంస్థ దత్తత తీసుకుని ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు స్కిల్స్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే చందనవెల్లి పారిశ్రమిక వాడలో ప్రతిష్టాత్మకమైన అమెజాన్, వెల్‌సన్, కటురా, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఈ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు. అలాగే సీతారాంపూర్‌లోని పారిశ్రమిక వాడలో మరో పరిశ్రామిక కంపెనీ అయిన వోలెక్ట్రా ఎలాక్ట్రనిక్ వెహికిల్ ఉత్పత్తి ప్లాంట్‌ను త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌ఐ పాస్ ద్వారా పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు ఇస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్‌లో షాబాద్ మండలం ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జపాన్ కాన్సులేట్ జనరల్ మైసూకితాగా, ఎండి శ్రీనివాస్ గరిమెళ్ల , చేవెళ్ల ఎంపి గడ్డం రంజిత్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి, ఎంఎల్‌ఎ కాలె యాదయ్య, ఎంఎల్‌సి పట్నం మహేందర్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ జయేశ్‌రంజన్, టిఎస్ ఐఐసి ఎండి నర్సింహారెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ రత్నం, బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కార్తీక్‌రెడ్డి, షాబాద్, మొయినాబాద్ జడ్‌పిటిసిలు పట్నం అవినాష్‌రెడ్డి, కాలె శ్రీకాంత్, సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News