Friday, April 26, 2024

అడవి రాజులనే అదరగొట్టింది..

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్‌లోని రణతంబోర్ పార్క్‌లో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. అడవికి రారాజులైన రెండు పులులు ఓ ఎలుగబంటి బెదిరింపులకు తోకముడిచాయి. నిమిషన్నరం పాటు ఈ మూడు అటవీ క్రూరమృగాల నడుమ సాగిన సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రణతంబోర్‌లో రెండు పులులకు ఓ ఎలుగుబంటి తారసపడింది. తొలుత పులులను చూసి బయపడి వాటి బారి నుంచి తప్పించుకునేందుకు ఎలుగుబంటి ప్రయత్నించింది. వెనక్కి తిరిగి అడుగులు వేస్తున్న ఎలుగబంటిని వేటాడేందుకు పులి దానిని అనుసరించింది. ఇక లాభం లేదనుకున్న ఎలుగుబంటి ఒక్కసారిగా పులికి ఎదురుతిరిగింది. పెద్ద పెట్టున్న తనదైన శైలిలో అరుపులు అందుకుంది. ఇంకేముంది ఎలుగు ప్రతాపం చూసిన పులి వెనక్కి తిరిగి పరుగులు పెట్టింది. మరో పులి ఎలుగుబంటి తిరుగుబాటును చూసి నిశ్చేష్టురాలైంది.

Sloth Bear Chases Away 2 Tigers At Ranthambore

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News