Thursday, May 2, 2024

సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్ సిటీ రైలులో పొగలు

- Advertisement -
- Advertisement -
ప్రమాదం లేదని నిర్ధారణ

మన తెలంగాణ / హైదరాబాద్ : సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌రైలులో పొగలు వచ్చాయి. ఈ రైలు జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ స్టేషన్ వద్దకు చేరుకోగానే పొగలు రావడాన్ని గమనించారు. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది స్టేషన్ ఘన్‌పూర్‌లో పది నిమిషాల పాటు రైలును నిలిపివేసి పూర్తి స్థాయిలో పరిశీలించారు. బ్రేక్ లైనర్లలో పొగలు వచ్చాయని.. ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించారు. అనంతరం రైలు యథావిధిగా గుంటూరుకు వెళ్లింది. పొగలు రావడంతో ఇంటర్ సిటీ రైలులోని ప్రయాణికులు ఒకింత ఆందోళనకు గురయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News