Friday, June 20, 2025

ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ గురువారం ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. 78 ఏళ్ల సీనియర్ నాయకురాలు కడుపుకు సంబంధించిన ఇన్ఫెక్షన్‌ కారణంగా జూన్ 15న ఆసుపత్రిలో చేరినట్లు ఆసుపత్రి నిర్ధారించింది. గత నాలుగు రోజులుగా సోనియా నిశితంగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. చికిత్స అనంతరం ఆమె కోలుకోవడంతో డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. ఆమె కుమారుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, సోనియాను ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లారు. “సోనియా పరిస్థితి ఇప్పుడు స్థిరంగా ఉంది. దీంతో ఆమెను డిశ్చార్జ్ చేశాం. అవుట్ పేషెంట్ ప్రాతిపదికన చికిత్స పొందుతూనే ఉంటారు” అని ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News