Sunday, April 28, 2024

రాజకీయాలకు సోనియా గాంధీ గుడ్ బై

- Advertisement -
- Advertisement -

రాయ్ పూర్: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం ప్రకటించారు. ఛత్తీస్ ఘడ్ రాయ్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ 85వ జాతీయ మహాసభల్లో ఈ మేరకు ప్రకటన చేశారు. భారత్ జోడో యాత్ర తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం సంతోషమన్నారు. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి టర్నింగ్ పాయింట్ అన్న ఆమె ఈ యాత్రతో తన ఇన్నింగ్స్ ముగించడం ఆనందం కలిగించిదన్నారు. పేదల కోసం పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్దంగా ఉంటుందని పేర్కొన్నారు. దేశానికి, కాంగ్రెస్ కు 2024 ఎన్నికలు పరీక్షలాంటివని తెలిపారు. యూపీఏ పాలన తనకు అత్యంత సంతృప్తినిచ్చిందని సోనియా గాంధీ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News