Friday, May 3, 2024

గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు

- Advertisement -
- Advertisement -

కొల్లాపూర్ రూరల్ : పల్లెల ముఖాభివృద్ధే లక్షంగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచే స్తుందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. బుధ వారం కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో పలు అ భివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా గ్రా మంలో నూతనంగా నిర్మించిన యాదవ కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామ ంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐ మాస్ట్ లైట్లను ప్రారంభించారు.

అదే విధంగా గ్రంథాలయ భవనాన్ని, ప్రాథమిక సహకార సంఘ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిఎం కెసిఆర్ గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తున్నారని, గ్రామాల అభివృద్ధికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమ ంలో మాచినేనిపల్లి సింగిల్ విండో చైర్మెన్ చింతకుంట శ్రీనివాసులుతో పాటు తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News