Friday, May 3, 2024

పిసిబిలో మట్టి గణపతికి ప్రత్యేక పూజలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సనత్‌నగర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి సభ్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మట్టి వినాయక ప్రతిమకు శాస్త్రోక్తంగా జరిగిన పూజలలో ఉద్యోగులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ బి.రఘు, సీనియర్ సామాజిక శాస్త్రవేత్త ప్రసన్న కుమార్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అధ్యక్షులు సి.మధుగౌడ్, ప్రధాన కార్యదర్శి ఆర్. నవీన్‌కుమార్ పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News