- Advertisement -
ప్రయాణీకుల అధిక రద్దీని దృష్టిలో పెట్టుకుని కాచిగూడబిలాస్పూర్కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ నెల 23 నుంచి జులై 14 వరకు ప్రతి సోమవారం బిలాస్పూర్కాచిగూడ (08263) ప్రత్యేక రైలు, ఈ నెల 24 నుండి జులై 15 వరకు కాచిగూడబిలాస్పూర్ (08264) ప్రత్యేక రైలు ప్రతి మంగళవారం నడుపుగున్నట్లు వెల్లడించింది. ఈ రైలు సర్వీసులు భాటాపారా, రాయిపూర్, దుర్గ్, రాజ్ నందగావ్, గోండియా, వాడ్సా, చందా ఫోర్ట్, బాల్హార్షా, సిర్పూర్ కాగజ్నగర్, మంచిర్యాల్, రామగుండం, కాజిపేట్, చర్లపల్లి, మల్కాజ్గిరి స్టేషన్లలో ఆగనున్నాయి.
- Advertisement -