Friday, May 3, 2024

క్రీడలు మేధా సంపత్తిని పెంపొందించేందుకు దోహదపడుతాయి

- Advertisement -
- Advertisement -

హన్మకొండ టౌన్ : క్రీడలు శరీర ఆరోగ్యం మెరుగుపరిచేందుకు, మేధా సంపత్తిని పెంపొందించేందుకు దోహదపడుతాయని మాజీ డిసిసీబీ చెర్మెన్ జంగా రాఘవ రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండ కలెక్టర్ ఆఫీస్ నుండి జవార్లల్ నెహ్రూ స్టేడియం వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒళంపిక్ డే రన్‌ని చైర్మన్ జంగా రాఘవ రెడ్డి ఒలంపిక్ టార్చ్ వెలిగించి ఘనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న 1000 మంది క్రీడాకారులకు జంగా రాఘవరెడ్డి టీ షర్ట్స్ ప్రదానం పంపిణీ చేశారు. అనంతరం నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన సభలో చైర్మన్ హోదాలో ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడారు. క్రీడలు సర్వరోగ నివారిణి అని కావునా ప్రతీ ఒక్కరు రోజూ తప్పకుండ వ్యాయామం చెయ్యాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు మహమ్మద్ అజీజ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి భైరబోయిన కైలాష్ యాదవ్, వరద రెడ్డి , కూడా చైర్మన్ సంఘం రెడ్డి సుందర్ రాజు, రిటైర్డ్ ఐపీయస్ నాగరాజు, 62,63 వ డివిజన్ కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, సయ్యద్ విజయశ్రీ రజాలి, గుర్రపు కోటేశ్వర్ బోయిన కుమార్ యాదవ్ హనుమకొండ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొడిపాక గణేష్, కాంటెస్ట్ కార్పొరేటర్ సందేల విజయ్ కుమార్, మహేందర్ రెడ్డి, కాసర్ల నాగేష్, రాజు,దొంగల కుమార్, రాజిరెడ్డి,సత్యవరం మధుకర్, అన్ని క్రీడా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News