Friday, May 3, 2024

విద్యార్థిని దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విద్యార్థిని దారుణ హత్యకు గురైన సంఘటన దేశ రాజధాని ఢిల్లీ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. అరవిందో కాలేజ్ వద్ద 25 ఏళ్ల మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. యువతి తలపై బలమైన గాయాలున్నట్లు, ఘటనా స్థలిలో ఐరన్ రాడ్ ను పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో యువతి కమలా నెహ్రూ పార్క్ లో నివసిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు సౌత్ ఢిల్లీ డిసిపి చందన్ చౌదరి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News